News
ఆదోని వెయిట్ & మెజర్మెంట్ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా అదోనిలో శనివారం తూనికలు మరియు కొలతల అధికారుల దాడులు నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ ప్రక్కన పెట్రోల్ బంక్ లో ఉన్న బాలాజీ వేయింగ్ బ్రిడ్జ్ లో 40కేజీల తేడా వస్తుందని నాన్ స్టాండర్డ్ క్రింద కేసునమోదు చేసామని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ కంట్రోల్ శ్రీరామ్ మాట్లాడుతూ తూకాలలో తేడాలు వస్తున్నాయని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి వేయింగ్ మిషన్లపై కూడా నిఘా ఉంచి దాడులు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా తూకాలు తేడా వస్తే తూనికల కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
పత్తి జిన్నిగ్ ఫ్యాక్టరీలలో వేయింగ్ మిషన్లు పెట్టి కొన్ని ఫ్యాక్టరీలో 50 కేజీల నుంచి 300 కేజీల వరకు రైతులను మోసం చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాటిపై నిఘా ఉంచి త్వరలో పట్టుకుంటామని అన్నారు. బయటవి ఉన్న వేయింగ్ మిషన్స్ కూడా ఫ్యాక్టరీలతో కుమ్మక్కై తూకాలు తేడా చేస్తున్నారని త్వరలో పూర్తి సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకుంటామని తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




