News
కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని టౌన్ శిరిగుప్ప చెక్పోస్ట్ వద్ద వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 7 బాక్సులు కర్ణాటక మధ్య 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. సిఐ విక్రమ సింహ ఇచ్చిన వివరాల మేరకు తమకు సమాచారం రావడంతో చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గశేష్ సర్కిల్ కు చెందిన మట్కా బీటర్ యువరాజ్, బబ్బులమ్మ గుడికి చెందిన హనుమన్న మరియు బోయ గేరికి చెందిన వీరేష్ ముగ్గురు రెండు లగేజి బ్యాగ్ లలో 7 బాక్సుల కర్నాటక మధ్యంను తీసుకొని వెళ్తుంటే పట్టుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ల లను స్వాధీనం చేసుకొని వారి ముగ్గురిని అరెస్టు చేసి , కేసు నమోదు పరచి రిమాండ్ కి తరలించామని తెలిపారు.
ఈ దాడుల్లో నందు 1 టౌన్ CI విక్రమసింహ, SI జహీర్ , సిబ్బంది రంగస్వామి, HC వీరా రెడ్డి, సుధీర్ , రంగస్వామి, అయ్యన్న మరియ ముస్తాక్ లు పాల్గొన్నారు.
పోలీసుల విజ్ఞప్తి…
దయచేసి అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్, పేకాట ల గురించి
9121101135 నెంబరు కు సమాచారం అందిచవలసిందిగా కోరారు…
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆదోని 1 టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




