Connect with us

News

ఎంపీ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

Published

on

వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ముద్దాయిగా విచారణలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కేసులు సిబిఐ వార్త కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై, కెమెరామెన్ పై దాడి చేసిన వారిని, ప్రోత్సహించిన అవినాష్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని శుక్రవారం సబ్ కలెక్టర్ కు రామాంజనేయులు వెంకటేష్ మాల రవి రామంజి వినతి పత్రం అందజేశారు. వివేకానంద రెడ్డిని సిబిఐ అధికారులు విచారణకు పిలవడం జరిగిందని గుర్తు చేశారు. తన తల్లికి బాగాలేదని విచారణకు హాజరు కాలనీ లాయర్లకు చెప్పి పులివెందులకు బయలుదేరిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అనుమానం వచ్చి అవినాష్ రెడ్డినీ సిబిఐ అధికారులు వెంబడించడంతో వార్తకు కవరేజ్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులపై దాడి పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. పాత్రికేయుల వాహనాలు ధ్వంసం చేయడమే కాకుండా కెమెరాలను ధ్వంసం చేసి అడ్డుకోబోయిన రిపోర్టర్స్ పై భౌతిక దాడి చేయడం ప్రజాస్వామ్యం బతికుందా అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య విషయంపై ఏమి జరుగుతుందో ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయాన్ని అందరికి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులపై దాడికి పాల్పడడం బావ స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించారు. తక్షణమే ఎంపీ అవినాష్ రెడ్డి పై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

సబ్ కలెక్టర్కు వినతిపత్రం ఇస్తున్న ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న  1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.

పూర్తి వీడియో చూడాలంటే యూట్యూబ్ లింకులు క్లిక్ చేయండి

డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు  తెలిపారు.

సబ్ రిజిస్టర్ అధికారి
తనిఖీలు చేస్తున్న అధికారులు
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
Continue Reading

News

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన
Continue Reading

News

BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు

Published

on

ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Continue Reading

Trending