News
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు..!
GST collection: దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో (GST collections) సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ నెలకు గానూ రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి..
గతేడాది ఏప్రిల్లో రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 12 శాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఏప్రిల్ నెలకు గానూ రూ.1,87,035 కోట్లు వసూలు అవ్వగా.. అందులో సీజీఎస్టీ కింద రూ.38,440 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.47,412 కోట్లు, రూ.89,158 కోట్ల మేర ఐజీఎస్టీ (రూ.34,972 కోట్ల దిగుమతైన వస్తువుల మీద), సెస్సు కింద రూ.12,025 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ (Finance ministry) శాఖ తెలిపింది. 2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.18.10 లక్షల కోట్లు వసూలయ్యాయని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 22 శాతం అధికమని కేంద్రం తెలిపింది.
రికార్డు స్థాయిలో జిఎస్టీ వసూళ్లు కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభవార్తగా ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. పిఐబి ప్రకటనను ట్విట్టర్లో కోడ్ చేస్తూ తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ…జిఎస్టీ వసూళ్లు పెరగడం విజయానికి సంకేతమని పేర్కొన్నారు..
ఏపీ 6.. తెలంగాణ 13 శాతం వృద్ధి..
తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు కూడా స్వల్పంగా పెరిగాయి. గతేడాది ఏప్రిల్లో రూ.4067 కోట్ల వసూళ్లు సాధించిన ఆంధ్రప్రదేశ్.. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.4329 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లు 6 శాతం మేర పెరిగాయి. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది రూ.4,955 కోట్లు సాధించగా.. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.5,622 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదు చేసింది..
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
-
News3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
-
News5 days agoరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
-
News3 weeks agoరైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి
-
News3 weeks agoరైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి
-
News3 days agoఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
