కర్నూలు జిల్లా అదోనిలో శనివారం తూనికలు మరియు కొలతల అధికారుల దాడులు నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ ప్రక్కన పెట్రోల్ బంక్ లో ఉన్న బాలాజీ వేయింగ్ బ్రిడ్జ్ లో 40కేజీల తేడా వస్తుందని నాన్ స్టాండర్డ్ క్రింద కేసునమోదు చేసామని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ కంట్రోల్ శ్రీరామ్ మాట్లాడుతూ తూకాలలో తేడాలు వస్తున్నాయని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి వేయింగ్ మిషన్లపై కూడా నిఘా ఉంచి దాడులు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా తూకాలు తేడా వస్తే తూనికల కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
పత్తి జిన్నిగ్ ఫ్యాక్టరీలలో వేయింగ్ మిషన్లు పెట్టి కొన్ని ఫ్యాక్టరీలో 50 కేజీల నుంచి 300 కేజీల వరకు రైతులను మోసం చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాటిపై నిఘా ఉంచి త్వరలో పట్టుకుంటామని అన్నారు. బయటవి ఉన్న వేయింగ్ మిషన్స్ కూడా ఫ్యాక్టరీలతో కుమ్మక్కై తూకాలు తేడా చేస్తున్నారని త్వరలో పూర్తి సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *