News
కార్పొరేట్ విద్యా సంస్థలల్లో ముందస్తుగా అడ్మిషన్లను అరికట్టాలి PDSO డిమాండ్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కార్పొరేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమ అడ్మిషన్ల ను అరికట్టాలని పిడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయుకులు తిరుమలేష్, డివిజన్ ప్రెసిడెంట్ ఖాదర్ మాట్లాడుతూ విద్యా అకాడమిక్ ఓపెన్ కాకముందే అడ్మిషన్ల కొరకు బ్యానర్లు కట్టుకొని విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు అలాగే సెలవు దినాలలో కూడా ఉపాధ్యాయులను అడ్మిషన్ల కొరకు పాఠశాలలో పని చేయించుకోవడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా విద్యా అధికారులు కూడా కార్పొరేట్ విద్యా సమస్యలపై చర్యలు తీసుకోకపోవడం వలన కార్పొరేట్ విద్యాసంస్థలలో విద్య వ్యాపారంగా మారిందని తెలిపారు. తక్షణమే అధికారుల స్పందించి జరుగుతున్న అక్రమాలు అరికట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ కోరారు. లేనియెడల పెద్ద ఎత్తున అధికారుల ఆఫీసుల ముందు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగస్వామి, ఆది, శివ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




